అందుకే భయపడుతున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

| Edited By:

Aug 20, 2019 | 4:17 AM

టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్ధి ఉద్యమాల నుంచి ఎదిగిన నడ్డాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. ప్రభుత్వ పాలన అవినీతి మయంగా మారిందని, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. మిషన్ కాకతీయ అనేకంటే కమీషన్ కాకతీయ అంటే బాగుంటుందన్నారు. ఇప్పటి వరకు కాకతీయ పనులు 50 శాతం […]

అందుకే భయపడుతున్నారు..  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్
Follow us on

టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్ధి ఉద్యమాల నుంచి ఎదిగిన నడ్డాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. ప్రభుత్వ పాలన అవినీతి మయంగా మారిందని, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. మిషన్ కాకతీయ అనేకంటే కమీషన్ కాకతీయ అంటే బాగుంటుందన్నారు. ఇప్పటి వరకు కాకతీయ పనులు 50 శాతం మాత్రమే పూర్తి చేశారని, గతంలో చేసిన పనులకే బిల్లులు తీసుకున్నారని 2017లో కాగ్ ప్రశ్నించిందని ఆరోపించారు లక్షణ్. అధికార టీఆర్ఎస్ పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.