టీ.బీజేపీలో ఎట్టకేలకు కదలిక.. యాక్షన్ ప్లాన్ రెడీ

|

Dec 28, 2019 | 4:25 PM

సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్టుపై దేశవ్యాప్తంగా ఆందోళనపర్వం రగులుకున్న పది రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు నిద్ర లేచారు. పౌరసత్వ సవరణ చట్టంపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. తొలుత బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌ వేదికగా సీఏఏపై సభ నిర్వహించాలని తలపెట్టగా తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన తన సభను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ పార్టీ […]

టీ.బీజేపీలో ఎట్టకేలకు కదలిక.. యాక్షన్ ప్లాన్ రెడీ
Follow us on

సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్టుపై దేశవ్యాప్తంగా ఆందోళనపర్వం రగులుకున్న పది రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు నిద్ర లేచారు. పౌరసత్వ సవరణ చట్టంపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. తొలుత బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌ వేదికగా సీఏఏపై సభ నిర్వహించాలని తలపెట్టగా తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన తన సభను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్ పార్టీ సీనియర్లతో శనివారం భేటీ అయ్యారు. యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు.

సిఏఏపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి , మాజీ మంత్రి డీకే అరుణ, పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 30న హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో సీఏఏ అనుకూల ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.

జనవరి 2, 3, 4 తేదీలలో జిల్లాల వారీగా వర్క్ షాప్‌ల నిర్వహించాలని, జనవరి 5, 6, 7 తేదీలలో మునిసిపాలిటీల వారీగా విద్యావేత్తల సదస్సులు, ర్యాలీలు జరపాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. జనవరి 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంటింటికి ప్రచారం చేయాలని, ప్రతి గ్రామంలో పతంగులు ఎగరేయాలని తలపెట్టారు. ప్రతి కార్యకర్త ఇంటిముందు ముగ్గులు వేయించడంతోపాటు సిఏఏకు సంఘీభావంగా ముగ్గుల పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు కమలం నేతలు. సీఏఏపై సభ నిర్వహించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై ఆరోపణలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కమలం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.