దేశంలో పలు రాష్ట్రాల్లో తలెత్తిన బర్ద్ ఫ్లూ మనుషులకూ సోకవచ్చునని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లో ఈ సరికొత్త బెడద కారణంగా 15 రోజులపాటు చికెన్, కోడిగుడ్ల షాపులను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇక కేరళలో బర్ద్ ఫ్లూ ను ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ గా ప్రకటించింది. ఈ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా నీన్ డోర్ పంచాయతీలోగల ఓ బాతుల క్షేత్రంలో 1650 బాతులు ఉన్నట్టుండి మరణించాయి. ఇంకా అళపుజ వంటి ఇతర జిల్లాల్లోనూ వేల సంఖ్యలో బాతులు మృతి చెందాయి.
కాగా 1996 లో చైనాలో మొదట హెచ్ 5 ఎన్ ఐ వైరస్ ని కనుగొన్నారు. 1997 లో మొదట హాంకాంగ్ లో మనుషులకు ఇది సోకినట్టు గుర్తించారు. 2016 లో కేరళలో తొలిసారి ఈ వైరస్ కేసు బయటపడింది. ఇండియా తో బాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో బర్ద్ ఫ్లూ భయాలు వెన్నాడుతున్నాయి.
Read More:
Man Cheating On house Scheme: కలెక్టరేట్లో ఉద్యోగినంటూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో ఓ వ్యక్తి మోసం
Covid Effect On Shabarimala: శబరిమలలో మకరసంక్రాంతి రోజున జ్యోతి దర్శనానికి భక్తుల సంఖ్యపై క్లారిటీ
ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!