Tamilnadu Government Alert: బర్ద్ ఫ్లూ పై తమిళనాడు ఆరోగ్య శాఖ హెచ్ఛరిక, అప్రమత్తత అవసరమని సూచన.

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 7:27 PM

దేశంలో పలు రాష్ట్రాల్లో తలెత్తిన బర్ద్ ఫ్లూ మనుషులకూ సోకవచ్చునని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి..

Tamilnadu Government Alert: బర్ద్ ఫ్లూ పై  తమిళనాడు ఆరోగ్య శాఖ హెచ్ఛరిక, అప్రమత్తత అవసరమని సూచన.
Follow us on

దేశంలో పలు రాష్ట్రాల్లో తలెత్తిన బర్ద్ ఫ్లూ మనుషులకూ సోకవచ్చునని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లో ఈ సరికొత్త బెడద కారణంగా 15 రోజులపాటు చికెన్, కోడిగుడ్ల షాపులను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం  ఆదేశించింది. ఇక కేరళలో బర్ద్ ఫ్లూ ను ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ గా ప్రకటించింది. ఈ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా నీన్ డోర్ పంచాయతీలోగల   ఓ బాతుల క్షేత్రంలో 1650 బాతులు ఉన్నట్టుండి మరణించాయి.  ఇంకా అళపుజ వంటి  ఇతర జిల్లాల్లోనూ వేల సంఖ్యలో బాతులు మృతి చెందాయి.

కాగా 1996 లో చైనాలో మొదట హెచ్ 5 ఎన్ ఐ వైరస్ ని కనుగొన్నారు. 1997 లో మొదట హాంకాంగ్ లో మనుషులకు ఇది సోకినట్టు గుర్తించారు. 2016 లో కేరళలో తొలిసారి ఈ వైరస్ కేసు బయటపడింది. ఇండియా తో బాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో బర్ద్ ఫ్లూ భయాలు వెన్నాడుతున్నాయి.

 

Read More:

Man Cheating On house Scheme: కలెక్టరేట్‌లో ఉద్యోగినంటూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో ఓ వ్యక్తి మోసం

Covid Effect On Shabarimala: శబరిమలలో మకరసంక్రాంతి రోజున జ్యోతి దర్శనానికి భక్తుల సంఖ్యపై క్లారిటీ

ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!