Breaking : మ‌రో విషాదం… బస్సు, ట్రక్కు ఢీ- 9 మంది కూలీలు మృతి..!

|

May 19, 2020 | 10:44 AM

కరోనా కాలంలో ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంటొన్న వ‌ల‌స కార్మికుల‌ను విధి కూడా ప‌గ‌బట్టిన‌ట్టు ఉంది. ఈ మ‌ధ్య జ‌రిగిన ప్ర‌మాదాల్లో ప‌దుల సంఖ్య‌లో కూలీలు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఇంటికి వెళ్లేందుకు ఎక్కిన‌ ట్రక్కులు, లారీలే వారికి య‌మ పాశాల‌వుతున్నాయి. తాజాగా బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో 9 మంది కూలీలు ప్రాణాలు విడిచారు. మరికొంద‌రికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను హాస్పిట‌ల్ కి […]

Breaking : మ‌రో విషాదం...  బస్సు, ట్రక్కు ఢీ- 9 మంది కూలీలు మృతి..!
Follow us on

కరోనా కాలంలో ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంటొన్న వ‌ల‌స కార్మికుల‌ను విధి కూడా ప‌గ‌బట్టిన‌ట్టు ఉంది. ఈ మ‌ధ్య జ‌రిగిన ప్ర‌మాదాల్లో ప‌దుల సంఖ్య‌లో కూలీలు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఇంటికి వెళ్లేందుకు ఎక్కిన‌ ట్రక్కులు, లారీలే వారికి య‌మ పాశాల‌వుతున్నాయి.

తాజాగా బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో 9 మంది కూలీలు ప్రాణాలు విడిచారు. మరికొంద‌రికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను హాస్పిట‌ల్ కి తరలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.