బీహార్లో రాహుల్కు కాంగ్రెస్ నేతల వెన్నుపోటు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీహార్లో కుట్ర జరిగిందని బీహార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నలుగురు కాంగ్రెస్ నేతలు, మిత్ర పక్షాలు కారణమని చెప్పారు. వారు ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లను ఇష్టా రాజ్యంగ అమ్ముకున్నారని… అధిక సొమ్ము ఇచ్చినవారికే కట్టబెట్టారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను వివరించేందుకు పార్టీ అధిష్ఠాన వర్గాన్ని కలవాలనుకునేవారికి అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్డీయేకు, […]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీహార్లో కుట్ర జరిగిందని బీహార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నలుగురు కాంగ్రెస్ నేతలు, మిత్ర పక్షాలు కారణమని చెప్పారు. వారు ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లను ఇష్టా రాజ్యంగ అమ్ముకున్నారని… అధిక సొమ్ము ఇచ్చినవారికే కట్టబెట్టారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను వివరించేందుకు పార్టీ అధిష్ఠాన వర్గాన్ని కలవాలనుకునేవారికి అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్డీయేకు, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని శపథాలు చేసిన మిత్ర పక్షాలు నిజానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడానికి కుట్ర పన్నినట్లు తెలిపారు.