భోగి మంటలతో.. మొదలైన సంక్రాంతి సంబరాలు

| Edited By:

Jan 14, 2020 | 8:15 AM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని వారు ట్వీట్లు చేస్తున్నారు. […]

భోగి మంటలతో.. మొదలైన సంక్రాంతి సంబరాలు
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని వారు ట్వీట్లు చేస్తున్నారు.

అయితే ఏపీలో అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉంటున్నారు. రాజధానిని విశాఖకు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో.. దాన్ని ఆ ప్రాంత రైతులు వ్యతిరేకిస్తూ గత 28 రోజులుగా ఆందోళలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం భోగి, సంక్రాంతి జరుపుకోవట్లేదని వారు ప్రకటించారు. మరోవైపు టీడీపీ కూడా రాజధాని రైతులకు మద్దతు ఇస్తూ పండుగను జరుపుకోవట్లేదని తెలిపింది.