ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా క్రెడ్

|

Sep 02, 2020 | 2:47 PM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2020 సందడి మొదలు కాబోతోంది. అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌ ఎంపికైనట్లు బీసీసీఐ (BCCI) వెల్లడించింది.   ఐపీఎల్‌ అధికారిక భాగస్వామి‌గా ఎంపికైన రెండో కంపెనీ...

ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా క్రెడ్
Follow us on

CRED as Official Partner : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2020 సందడి మొదలు కాబోతోంది. అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌ ఎంపికైనట్లు బీసీసీఐ (BCCI) వెల్లడించింది.   ఐపీఎల్‌ అధికారిక భాగస్వామి‌గా ఎంపికైన రెండో కంపెనీ క్రెడ్‌ కావడం విశేషం. ఐపీఎల్‌ మూడు సీజన్లకు అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన ఎడ్యూ-టెక్‌ సంస్థ ‘అన్అకాడమీ’ వ్యవహరిస్తుందని గతవారం బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన ‘అన్అకాడమీ’ మూడేళ్లకు గానూ సుమారు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌గా ‘డ్రీమ్ 11’ వ్యవహరిస్తోంది.