ఉగ్రసంస్థలకు పాక్ ప్రభుత్వం పూర్తి మద్దతు పలుకుతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఉగ్రవాద సంస్థలైన జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తోయిబాకు చెందిన వారి బ్యాంకు అకౌంట్లను ఇమ్రాన్ సర్కార్ పునరుద్దించింది. ఈ అకౌంట్లలో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ బ్యాంకు అకౌంట్ కూడా ఉంది. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ నుంచి అధికారికంగా ఆమోదం పొందడంతో.. పాక్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. హఫీజ్తో పాటు.. అబ్దుల్ సలాం భుట్టవి, హాజీ ఎం అష్రాఫ్, యాహ్యా ముజాహిద్, జాఫర్ ఇక్బాల్ బ్యాంకు అకౌంట్లను కూడా పునరుద్దరించింది. ఈ ఐదుగురు యూఎన్సీసీ ఎన్లిస్టెడ్ త్రీవావాదులని తెలిపింది.
కాగా, ప్రస్తుతం వీరంతా టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో లాహోర్ జైలులో శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే వీరంతా తమ కుటుంబ వ్యవహారాలను నిర్వహించేందుకు వీలుగా బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు.
Bank accounts of Hafiz Saeed and JuD leaders restored after formal approval from United Nations sanctions committee: Pakistan Media (file pic) pic.twitter.com/znhksGq6hk
— ANI (@ANI) July 12, 2020