బద్రీనాథుని ఆలయంపై మంచు దుప్పటి!

| Edited By:

Dec 28, 2019 | 4:18 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం మంచుతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. సాధారణంగానే ఆ ప్రాంతాల్లో.. ఎముకలు కొరికే చలి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వింటర్ సీజన్ అయ్యేసరికి.. నారాయణుడి ఆలయం సగం వరకూ మంచుతో నిండిపోయింది. అయితే ఆ ప్రదేశం మాత్రం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. మంచుతో నిండి ఉన్న ఆలయాన్ని చూసేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంతేకాకుండా.. ఉత్తర భారతంలోని […]

బద్రీనాథుని ఆలయంపై మంచు దుప్పటి!
Follow us on

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం మంచుతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. సాధారణంగానే ఆ ప్రాంతాల్లో.. ఎముకలు కొరికే చలి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వింటర్ సీజన్ అయ్యేసరికి.. నారాయణుడి ఆలయం సగం వరకూ మంచుతో నిండిపోయింది. అయితే ఆ ప్రదేశం మాత్రం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. మంచుతో నిండి ఉన్న ఆలయాన్ని చూసేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంతేకాకుండా.. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కుఫ్రీ, మనాలి, సోలాన్‌, భుంటర్‌, సుందర్‌నగర్‌, కల్పా తదితర ప్రాంతాల్లో శుక్రవారం సున్నా డిగ్రీల సెల్సియస్‌ కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కీలాంగ్‌లో అయితే రికార్డు స్థాయిలో మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని హిమాచల్‌ప్రదేశ్‌ వాతావరణ శాఖ అధికారి మన్మోహన్‌ సింగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2 వరకు హిమపాతంతో పాటు వర్షం కూడా పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. గత 24 గంటల్లో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉందని వెల్లడించారు.