బాలయ్యకు బాబు అన్యాయం.. రోజా సంచలన వ్యాఖ్య

|

Dec 11, 2019 | 3:42 PM

సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు.. స్వయానా తన బావమరిది, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు రోజా. బుధవారం రోజా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బాలయ్య బాబుకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె కామెంట్ చేయడంతో టిడిపి ఎమ్మెల్యేలు ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు కళాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అందులో భాగంగానే హిందూపూర్ నుంచి శాసనసభకు ఎన్నికైన నటుడు […]

బాలయ్యకు బాబు అన్యాయం.. రోజా సంచలన వ్యాఖ్య
Follow us on

సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు.. స్వయానా తన బావమరిది, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు రోజా. బుధవారం రోజా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బాలయ్య బాబుకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె కామెంట్ చేయడంతో టిడిపి ఎమ్మెల్యేలు ఉలిక్కిపడ్డారు.

చంద్రబాబు కళాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అందులో భాగంగానే హిందూపూర్ నుంచి శాసనసభకు ఎన్నికైన నటుడు నందమూరి బాలకృష్ణకు సభలో మాట్లాడే అవకాశం చంద్రబాబు ఇవ్వడం లేదని రోజా ఆరోపించారు. తన అనుచర వర్గాన్ని ప్రభుత్వంపైనా, అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా ఉసి గొల్పుతున్న చంద్రబాబు.. బాలకృష్ణ లాంటి కళాకారులకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం విడ్డూరంగా వుందని రోజా కామెంట్ చేశారు.

కాగా, నారా లోకేశ్‌ను చూస్తే ఏపీ మంత్రుల కాళ్ళు వణుకుతున్నాయన్న టిడిపి నేతల మాటలను రోజా ఎద్దేవా చేశారు. లోకేశ్‌ను చూస్తే నిజంగానే మంత్రులతో పాటు తన కాళ్ళూ వణుకుతున్నాయని రోజా వ్యంగ్యంగా అన్నారు. మంగళగిరి అని పలకడానికి కూడా ట్యూషన్ పెట్టించుకుంటున్న లోకేశ్‌ని చూస్తే ఎవరికైన కాళ్ళు వణుకుతాయని అన్నారు రోజా.