హీరో నాని నిర్మాతగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అ’. గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా రాబట్టింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించరు. ఈ చిత్రం ఇటీవల రెండు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘అ’ మంచి విజయం సాధించగా.. దాని సీక్వెల్ ఒకవేళ సెట్స్ పైకి వెళ్తే.. అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉంటాయి.