మాక్స్‌వెల్ ‘ఐపీఎల్ ఎలెవన్’.. రోహిత్, స్మిత్‌లకు నో ప్లేస్..!

|

Aug 15, 2020 | 3:37 PM

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరపున బరిలోకి దిగనున్న ఆసీస్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్ వెల్ తాజాగా తన 'బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్'ను ఎంచుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ జట్టులో రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు ప్లేస్ ఇవ్వలేదు.

మాక్స్‌వెల్ ఐపీఎల్ ఎలెవన్.. రోహిత్, స్మిత్‌లకు నో ప్లేస్..!
Follow us on

Maxwell Best IPL XI: క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. 54 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ నవంబర్ 10న ముగుస్తుంది. వివిధ దేశాల ఆటగాళ్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరపున బరిలోకి దిగనున్న ఆసీస్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్ వెల్ తాజాగా తన ‘బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్’ను ఎంచుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ జట్టులో రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు ప్లేస్ ఇవ్వలేదు.

మాక్స్ వెల్ తన జట్టులో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలను ఓపెనర్లుగా ఎంచుకోగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలను, ఐదులో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు తనకు తానే స్వయంగా ఎన్నుకున్న మాక్స్ వెల్.. కీపర్‌గా ధోనిని, మరో ఆల్‌రౌండర్‌గా ఆండ్రీ రస్సెల్‌ను ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్‌గా హర్భజన్‌ను సెలెక్ట్ చేసిన మాక్స్ వెల్.. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మోహిత్ శర్మలను తీసుకున్నాడు.