మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి..!

|

Jul 02, 2020 | 3:17 PM

ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 100 మంది మరణించారు. ఈ విషాయాన్ని ఆ దేశంలోని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు నిర్దారించారు.

మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి..!
Follow us on

ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 100 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు నిర్దారించారు. కాచిన్ రాష్ట్రంలోని జాడే-రిచ్ హపకాంత్ ప్రాంతంలో మైనర్లు రాళ్ళు సేకరిస్తున్నప్పుడు, భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడగా.. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. అధికారులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న‌ సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్న‌ట్లు సమాచారం.