కశ్మీర్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఐఈడీ నిర్వీర్యం

| Edited By:

May 27, 2019 | 3:35 PM

జమ్ముకశ్మీర్ లో మరో పెను ప్రమాదం తప్పింది. పూంచ్ సెక్టార్‌లోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఐఈడీ బాంబును భారత సైనికులు గుర్తించారు. వెంటనే ఆ సమీపంలో హై అలర్ట్ ప్రకటించి.. రహదారిపై వాహనాలను నిలిపివేశారు. అనంతరం ఆర్మీ బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ చేరుకుని ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు పాల్పడిందన్న దానిపై ఆర్మీతో పాటు జమ్ముపోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా.. రహదారిపై తనిఖీలు […]

కశ్మీర్‌లో తప్పిన పెను ప్రమాదం.. ఐఈడీ నిర్వీర్యం
Follow us on

జమ్ముకశ్మీర్ లో మరో పెను ప్రమాదం తప్పింది. పూంచ్ సెక్టార్‌లోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఐఈడీ బాంబును భారత సైనికులు గుర్తించారు. వెంటనే ఆ సమీపంలో హై అలర్ట్ ప్రకటించి.. రహదారిపై వాహనాలను నిలిపివేశారు. అనంతరం ఆర్మీ బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ చేరుకుని ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు పాల్పడిందన్న దానిపై ఆర్మీతో పాటు జమ్ముపోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా.. రహదారిపై తనిఖీలు చేపడుతున్నారు.