ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

|

Nov 05, 2020 | 6:09 PM

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం
Follow us on

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో స‌రిహ‌ద్దు భద్రతా బ‌ల‌గాలు స్వాభిమాన్ ఆంచల్ కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, 3 ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్, ఐఈడీ, 9 రౌండ్ల ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మవోయిస్ట్ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డంప్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విశాఖ ఏజేన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ఏజేన్సీ ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.