గొల్కొండ, చార్మినార్ సందర్శకుల నిలిపివేత

|

Jul 07, 2020 | 11:55 AM

కరోనా ప్రభావం పురావస్తు కట్టడాలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కేసులతో జన సమూహాం కలిగిన ప్రాంతాల్లో నిషేధం విధించారు. అయితే, అన్ లాక్ 2 లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. కానీ, మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండడంతో సందర్శకులను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

గొల్కొండ, చార్మినార్ సందర్శకుల నిలిపివేత
Follow us on

కరోనా ప్రభావం పురావస్తు కట్టడాలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కేసులతో జన సమూహాం కలిగిన ప్రాంతాల్లో నిషేధం విధించారు. అయితే, అన్ లాక్ 2 లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. కానీ, మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండడంతో సందర్శకులను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఇదివరకే ఆర్కియాలాజికల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ, చార్మినార్ కట్టడాల్లో సందర్శకుల రాకను పునరుద్ధరించారు.

అయితే, ప్రస్తుతం రెండు ప్రాంతాలు కంటెయిన్ మెంట్ ఏరియాలో ఉండటంతో పర్యాటకుల అనుమతికి స్థానిక అధికారులు నిరాకరించారు. దీంతో చార్మినార్‌, గోల్కొండలకు ప్రస్తుతం పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్లు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. జులై చివరి వారంలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయం కూడా ప్రారంభమైంది. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన సందర్శకులు పదుల సంఖ్యలో మాత్రమే రెండు చోట్లకూ వచ్చారు. కానీ, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అయోమయంలో పడ్డ పురావస్తుశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీ అధికారులతో మరోసారి చర్చించి సందర్శకులను నిలిపివేసినట్లు సమాచారం.