ఆ వార్తలో నిజం లేదు : మంత్రి ముత్తంశెట్టి

|

Oct 06, 2020 | 10:32 AM

ఏపీలో ఫ్లోటింగ్ క్యాసినోల ఏర్పాట్లు.. అంటూ వస్తున్న వార్తా కథనాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాస రావు స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. ఈ తరహా కార్యకలాపాలను ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదని తేల్చిచెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అవంతి.. పర్యాటకం ఆంధ్రప్రదేశ్ కు ఒక ముఖ్యమైన రంగమని పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని అవంతి స్పష్టం చేశారు.

ఆ వార్తలో నిజం లేదు : మంత్రి ముత్తంశెట్టి
Follow us on

ఏపీలో ఫ్లోటింగ్ క్యాసినోల ఏర్పాట్లు.. అంటూ వస్తున్న వార్తా కథనాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాస రావు స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. ఈ తరహా కార్యకలాపాలను ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదని తేల్చిచెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అవంతి.. పర్యాటకం ఆంధ్రప్రదేశ్ కు ఒక ముఖ్యమైన రంగమని పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని అవంతి స్పష్టం చేశారు.