ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

|

May 08, 2020 | 12:06 PM

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తు ఇటీవల జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సహేతుకంగా లేవని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును అశ్రయించాయి. ఇక ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఫీజులను సరిగ్గా నిర్ణయించలేదని వాదించారు. విద్యాసంవత్సరం మొదట్లో నిర్ణయించాల్సిన ఫీజులను. చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. […]

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..
Follow us on

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తు ఇటీవల జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 15ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సహేతుకంగా లేవని 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును అశ్రయించాయి. ఇక ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఫీజులను సరిగ్గా నిర్ణయించలేదని వాదించారు. విద్యాసంవత్సరం మొదట్లో నిర్ణయించాల్సిన ఫీజులను. చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ ఫీజులను మూడేళ్లకు ఒకసారి ఖరారు చేయాల్సి ఉందని.. ఈ విషయం గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు.

కానీ కొత్తగా వచ్చిన కమీషన్ ఆ ఆదేశాలను బేఖాతర్ చేసి ఒక్క ఏడాదికి మాత్రమే ఫీజులు ఖరారు చేయడమేంటన్నారు. అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కాలేజీలను పరిశీలించిన తర్వాతే ఫీజులు నిర్ణయించామని వివరించారు. ఇక ఇద్దరి వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి పిటీషన్‌దారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జీవోను సస్పెండ్ చేశారు. అంతేకాక దీనిపై పూర్తీ వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఏపీహెచ్ఈఆర్ఎంసీ చైర్మన్‌ను ఆదేశించారు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!