ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే: సుజనా

| Edited By:

Aug 28, 2019 | 7:51 PM

ఏపీ ప్రభుత్వం వరద నిర్వహణలో విఫలం కావడం వల్లే లంక గ్రామాలన్నీ మునిగిపోయాయని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. కృష్ణాజిల్లాలోని లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతుల పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. పంట పొలాలు మునిగిపోయిన రైతులను పరామర్శించారు. బాధితులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ పార్టీల వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్య ఉన్న బీజేపీ వద్దకు రావాలని సుజనా పిలుపునిచ్చారు. 

ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే: సుజనా
Follow us on

ఏపీ ప్రభుత్వం వరద నిర్వహణలో విఫలం కావడం వల్లే లంక గ్రామాలన్నీ మునిగిపోయాయని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. కృష్ణాజిల్లాలోని లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతుల పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. పంట పొలాలు మునిగిపోయిన రైతులను పరామర్శించారు. బాధితులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ పార్టీల వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్య ఉన్న బీజేపీ వద్దకు రావాలని సుజనా పిలుపునిచ్చారు.