సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

|

Nov 01, 2020 | 10:26 PM

రేపటి నుంచి రాష్ట్రంలో బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రతి విద్యార్థికి మాస్కు ఇస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం...

సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
Follow us on

All Educational Institutions : రేపటి నుంచి రాష్ట్రంలో బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రతి విద్యార్థికి మాస్కు ఇస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.

కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు. తగ్గించిన సిలబస్‌తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులను.. టీసీ లేకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటామని తెలిపారు. నాడు-నేడు కింద కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తి కాలేదని, కరోనా కారణంగా కూలీలు దొరక్క పనులు జరగలేదని సురేష్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు వచ్చేనెల రెండోతేదీ నుంచి తెరుచుకోనున్నాయి. స్కూళ్లను, కాలేజీలను పునఃప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే విశ్వవిద్యాలయాలు, వాటి అఫిలియేటెడ్‌ కాలేజీలను కూడా తెరవనున్నారు. ఇందులో యూజీ/పీజీ ప్రొఫెషనల్‌, నాన్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటాయి. కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు పనిచేస్తాయి.