AP DGP To Attend High Court: అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వెహికల్స్ విడుదల విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే, ప్రభుత్వ న్యాయవాది వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.