సరైన అవగాహనతో, రోగం వచ్చిందని భయపడకుండా నిబ్బరంతో చికిత్స పొందుతూ ముందుకెళ్తే క్యాన్సర్ను కూడా జయించవచ్చని చెప్పారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మెడికల్ రంగంలో నేడున్న వైద్య సాంకేతిక, ఆధునిక విధానాల వల్ల క్యాన్సర్ను కూడా పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 7వ వార్సికోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన వెబ్నార్లో వైద్య రంగానికి చెందిన ప్రముఖులు ప్రసంగించారు. ముఖ్య అథితిగా హాజరైన ఏపీ డీజీపీ గౌతం సావాంగ్ క్యాన్సర్ వ్యాధిపట్ల భయపడకుండా.. గుండె ధైర్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ నిర్వాహకులు సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ115 దేశాల్లో ఈ ఫౌడేషన్ వైద్య సేవలు అందిస్తోంది.. ఇప్పటి వరకు వెయ్యి 150 కార్యక్రమాలను నిర్వహించిందని వెల్లడించారు.