ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. అధికారులు పూర్తిగా సహకరిస్తే ప్రజల కల సాకారం అవుతుందని సీఎం జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలోని అన్ని హామీలు నిరవేర్చడానికి మీ అందరి సహకారం అవసరమని జగన్ కోరారు. కొన్ని పనులు చేయించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండటం సహజంమని.. గతంలో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను నేను ఎవరిని తప్పుపట్టనని అన్నారు. రేపటి కేబినెట్ భేటీలో 27 శాతం ఐఆర్ ప్రకటిస్తామని తెలిపారు. సీపీఎస్ రద్దుపైన కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి విద్యార్హతలను బట్టి పర్మినెంట్ చేయడానికి కమిటీ వేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతాము. ఈ సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు సుమారు 300 మంది పాల్గొన్నారు.