ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ వైఎస్సాన్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పిస్తారు. నిన్న గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వచ్చిన సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు. రాత్రి ఇడుపులపాయలోనే జగన్ బస చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని కాసేపట్లో వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తరువాత అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.