దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వారు వైఎస్సార్కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్ కుటుంబంతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రా రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ పార్టీ నేతలు, అభిమానులు, కార్యరర్తలు పాల్గొన్నారు. కాగా మరోవైపు వైఎస్సార్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.