ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ వెళ్లిన తర్వాత.. రాష్ట్రంలో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన వచ్చిన వెంటనే ఏపీ మంత్రులతో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్న ఆయన అక్కడ నుంచి మరో విమానంలో గన్నవరానికి చేరుకోనున్నారు.
పోలవరం ప్రాజెక్టు, హైకోర్టు తీర్పు, రాష్ర్టంలో వరదలు, చంద్రబాబు ఇల్లు రచ్చ, అలాగే.. ఏపీ రాజధానిపై జరిగే ప్రచారంపై మంత్రులతో.. జగన్ మాట్లాడనున్నట్లు సమాచారం. అలాగే.. కొంత మంది మంత్రులకు దిశానిర్ధేశం కూడా చేసే అవకాశం ఉంది. అనంతరం.. వీటన్నింటిపై సీఎం జగన్ ప్రెస్మీట్టే అవకాశం కూడా లేకపోలేదు.