ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నాగార్జునసాగర్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నాగార్జునసాగర్కి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి జగన్కు తెలంగాణ ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు, భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఏపీ సీఎం జగన్కు స్వాగతం పలకనున్నారు . వైఎస్ జగన్తో పాటు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. అనంతరం మాచర్లలో జరగనున్న జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.