ఏయూని టాప్‌లోకి తీసుకొస్తా.. కొత్త స్టాఫ్‌ని తీసుకుంటాం: జగన్

| Edited By:

Dec 13, 2019 | 8:32 PM

ఆంధ్రప్రదేశ్‌కి.. ఆంధ్రా యూనివర్శిటీ ఒక గర్వకారణమని అన్నారు సీఎం జగన్. అలుమిని మీట్‌లో భాగంగా.. ఆంధ్రా యూనివర్శిటీలో పాల్గొన్నారు జగన్. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విశ్వ విద్యాలయాల్లో.. 14వ స్థానంలో ఉన్న ఏయూని టాప్‌ 5లో ఒకటిగా తీసుకొస్తామన్నారు. యూనివర్శిటీలో 459 టీచింగ్ స్టాఫ్ ఖాళీలున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. విద్యార్థుల గ్రాస్ ఎన్‌ రోల్‌మెంట్‌లె మన […]

ఏయూని టాప్‌లోకి తీసుకొస్తా.. కొత్త స్టాఫ్‌ని తీసుకుంటాం: జగన్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌కి.. ఆంధ్రా యూనివర్శిటీ ఒక గర్వకారణమని అన్నారు సీఎం జగన్. అలుమిని మీట్‌లో భాగంగా.. ఆంధ్రా యూనివర్శిటీలో పాల్గొన్నారు జగన్. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విశ్వ విద్యాలయాల్లో.. 14వ స్థానంలో ఉన్న ఏయూని టాప్‌ 5లో ఒకటిగా తీసుకొస్తామన్నారు. యూనివర్శిటీలో 459 టీచింగ్ స్టాఫ్ ఖాళీలున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. విద్యార్థుల గ్రాస్ ఎన్‌ రోల్‌మెంట్‌లె మన దేశం 23లో ఉందని జగన్ పేర్కొన్నారు.

కాగా.. తర్వాతి తరానికి ఇవ్వగలిగే ఆస్తి.. ‘చదువు’ మాత్రమే అన్నారు. కాలేజీ విద్యని అభ్యసించడంలో.. 77 శాతం పిల్లలు ఇంటర్‌ విద్యతోనే డ్రాపౌట్ అవుతున్నారని.. చదువు జీవితాన్నే మారుస్తుందని చెప్పారు. మంత్రి సురేష్ ఏడో తరగతి వరకూ.. తెలుగు మీడియంలో చదవి ఐఆర్‌ఎస్ అధికారి అయ్యాడని.. చదువంటే అతనికి ఫ్యాషన్ కనుగ.. అందుకే విద్యాశాఖ ఇచ్చానని తెలిపారు. అలాగే.. రాష్ట్రంలో 45 వేల పాఠశాలలు ఉన్నాయి.. ప్రస్తుతం వాటి పరిస్థితులు ఏమీ బాగోలేదు.. 2020 జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకు వస్తున్నాం. విద్యాశాఖలో సంస్కరణలు కేవలం పాఠశాల విద్యకే కాకుండా ఉన్నత విద్యలోనూ తీసుకువస్తామని జగన్ స్పష్టం చేశారు.

డిగ్రీని ‘డిగ్రీ ఆనర్స్‌’గా మారుస్తాం. విద్యా సంస్థల్లో వందశాతం పూర్తిగా.. ఫీజు రీయంబర్స్‌ మెంట్ ఇస్తామన్నారు. ‘విద్యా దీవెన’ పేరుతో విద్యార్థులకు లాడ్జింగ్, బోర్డింగ్ కింద రూ.20 వేలు చెల్లిస్తామన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం.. ప్రస్తుత విద్యార్థులకు దోహదకారి నిలవాలన్నారు. ప్రభుత్వం నుంచి 50 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఏయూకి అందిస్తామని చెప్పారు సీఎం జగన్.