ఆళ్ల రాక్స్..లోకేష్ షాక్స్..మంగళగిరిలో వైసీపీ విజయం

|

May 23, 2019 | 8:31 PM

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్… గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి […]

ఆళ్ల రాక్స్..లోకేష్ షాక్స్..మంగళగిరిలో వైసీపీ విజయం
Follow us on

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్… గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేశ్‌కు ఓటమి తప్పలేదు. మొదట ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించిన లోకేష్… ఆ తరువాత ఆధిక్యం విషయంలో వెనుకబడుతూ వచ్చారు.

ఆర్కేకు వ్యక్తిగతంగా మంచి పేరుంది. అధికారంలో లేకపోయినా తన స్థొమతకు తగ్గట్టు ఆయన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక
ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేయడంతో పాటు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి నారా లోకేశ్ గెలుపు కోసం భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ స్థానంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే అంశంపై గత 40 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఏపీలో లోకేష్ విజయావకాశాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ చివరకు ఈ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆర్కేను గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తానని మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో జగన్ హామీ ఇవ్వడంతో… ఇక ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది.