Anushka Latest Photos Viral: భారతదేశంలో టాప్ సెలబ్రిటీల్లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఒకరనడంలో ఎలాంటి ఎలాంటి సందేహం లేదు. టీమిండియా సారథి విరాట్ కోహ్లిని వివాహం చేసుకున్న తర్వాత అనుష్క వార్తల్లో నిలవడం మరీ ఎక్కువైంది. ఈ జంట ఎక్కడ కనిపించినా అదో పెద్ద వార్త అవుతోంది.
ఇదిలా ఉంటే విరాట్ దంపతులు బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా గర్భిణీగా ఉన్న సమయంలో సెలబ్రిటీలు పెద్దగా మీడియాకు కనిపించకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ అనుష్క మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఫొటో షూట్లలో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే బేబీ బంప్ కనిపించేలా సోషల్ మీడియాలో పలు ఫొటోలను పోస్ట్ చేసిన అనుష్క.. తాజాగా ప్రముఖ వోగ్ మేగజైన్ కోసం ఫొటో షూట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారాయి. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే 25 లక్షలకుపైగా లైక్లు రావడం విశేషం.
‘వోగ్’ మేగజైన్ కోసం అనుష్క చేసిన ఫొటో షూట్..
Also Read: పెళ్లి తేదీని ప్రకటించిన సింగర్ సునీత.. శ్రీవారిని దర్శించుకున్న గాయని.. మ్యారెజ్ ఎప్పుడంటే ?..