Corona Virus:చెన్నైలో తాజాగా మరో హోటల్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. లీలా మహల్ అనే ఈ ‘ఖరీదైన’ హోటల్లోని ఉద్యోగుల్లో 20 మందికి కరోనా పాజిటివ్ సోకింది. ఇటీవలే గిండీలోని గ్రాండ్ చోళా హోటల్లో సుమారు 85 మందికి ఈ వైరస్ సోకింది. డిసెంబరు 15-జనవరి 2 మధ్య మరొక హోటల్లో కూడా సుమారు 10 మంది దీని బారిన పడ్డారు. ఇలా వరుసగా పెద్ద హోటళ్లలో సిబ్బంది కరోనా వైరస్ బారిన పడడంతో వీటి యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. మొదట డిసెంబరు రెండోవారంలో ఓషెఫ్ కరోనా వైరస్ పాజిటివ్ కి గురి అయ్యారు. అయితే ఇలా వివిధ హోటళ్లకు వస్తున్న కస్టమర్లలో ఎవరికైనా ఈ వైరస్ ఉందా, దాని ప్రభావం వల్లే తమ సిబ్బంది ఇలా దీనికి గురవుతున్నారా అని ఈ యాజమాన్యాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఏమైనా పాజిటివ్ కి గురైనవారినందరినీ క్వారంటైన్ కి పంపారు.
Also Read:
Rama Theertham Incident: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..
Police Posts : పోలీస్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువత.. సీఎం ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా..