ఏపీ కరోనా బులిటెన్… గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,121 పాజిటివ్ కేసులు..

|

Nov 22, 2020 | 6:07 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,121 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కి చేరింది.

ఏపీ కరోనా బులిటెన్... గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,121 పాజిటివ్ కేసులు..
Follow us on

Ap Corona Report : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,121 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కి చేరింది. ఇందులో 14,249 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,41,026 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అటు నిన్న వైరస్ కారణంగా 11 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,938కు చేరుకుంది. ఇక నిన్న 1,631 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 96,15,090 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 46, చిత్తూరు 130, తూర్పుగోదావరి 134, గుంటూరు 164, కడప 60, కృష్ణా 167, కర్నూలు 21, నెల్లూరు 26, ప్రకాశం 64, శ్రీకాకుళం 67, విశాఖపట్నం 77, విజయనగరం 23, పశ్చిమ గోదావరి 142 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,624 కి చేరింది.