ఏపీకి చెందిన 38 మంది వలస కూలీలకు కరోనా…

|

May 12, 2020 | 10:09 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 930 వలస కూలీలు… మహారాష్ట్రలోని థానే నుంచి స్పెష‌ల్ ట్రైన్ లో గుంతకల్లుకు చేరుకున్నారు. వారిలో 250 మందికి క‌రోనా టెస్టులు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు. కర్నూలుకు చెందిన 37మందితో పాటు కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకినట్టు​ నిర్దార‌ణ‌ అయ్యిందని ఆయన వివరించారు. మిగిలిన కూలీలను క్వారంటైన్​కు తరలించామన్నారు. పాజిటివ్ గా తేలిన‌వారిని […]

ఏపీకి చెందిన 38 మంది వలస కూలీలకు కరోనా...
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 930 వలస కూలీలు… మహారాష్ట్రలోని థానే నుంచి స్పెష‌ల్ ట్రైన్ లో గుంతకల్లుకు చేరుకున్నారు. వారిలో 250 మందికి క‌రోనా టెస్టులు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.

కర్నూలుకు చెందిన 37మందితో పాటు కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకినట్టు​ నిర్దార‌ణ‌ అయ్యిందని ఆయన వివరించారు. మిగిలిన కూలీలను క్వారంటైన్​కు తరలించామన్నారు. పాజిటివ్ గా తేలిన‌వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు చెప్పారు