వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. ఆయన తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్ చెప్పగా… సెన్సార్ బోర్డు వాటిని తొలగించి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే సర్టిఫికెట్ ఇవ్వడంలో కొంత జాప్యత జరగగా.. చిత్ర యూనిట్ ఆందోళన చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు రివైజింగ్ కమిటీ చిత్రాన్ని పూర్తిగా చూసి.. సెన్సార్ చేయాలని సూచించింది. ఇక ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
BAD NEWS FOR EVERYONE who tried to stop AMMA RAJYAMLO KADAPA BIDDALU All issues of Censor and Cases sorted..Con men and Jokers can try delaying tactics but can’t stop constitution guaranteed freedom of expression ..Film releasing tomorrow Dec 12th as per schedule ? Here’s CC?? pic.twitter.com/NrKxtQEkzs
— Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2019
Because it’s releasing tmrw, I think he’s thinking what to do now ? pic.twitter.com/lpDOohLicT
— Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2019
Amma రాజ్యంలో కడప Biddalu రెండు కులాల మధ్య గొడవ పెట్టే సినిమా కాదు … ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే anukokunda తప్పక చూడండి .. రేపే విడుదల pic.twitter.com/zCUqaymj6M
— Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2019