గాంధీనగర్‌లో అమిత్ షాకు రికార్డు మెజారిటీ

| Edited By:

May 23, 2019 | 5:24 PM

బీజేపీ చీఫ్ అమిత్ షా రికార్డులు బద్దలు గొట్టారు. ఎల్‌కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డు అమితా షా దెబ్బకు గల్లంతైంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగిన షా కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై 5,11,180 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడ అద్వానీ 4.83 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఇక్కడ అదే రికార్డు కాగా, ఆ రికార్డును అమిత్ షా తిరగరాశారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా […]

గాంధీనగర్‌లో అమిత్ షాకు రికార్డు మెజారిటీ
Follow us on

బీజేపీ చీఫ్ అమిత్ షా రికార్డులు బద్దలు గొట్టారు. ఎల్‌కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డు అమితా షా దెబ్బకు గల్లంతైంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగిన షా కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై 5,11,180 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడ అద్వానీ 4.83 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఇక్కడ అదే రికార్డు కాగా, ఆ రికార్డును అమిత్ షా తిరగరాశారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి కట్టుబడిన షా ఇప్పుడు లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. తాజాగా వార్తల ప్రకారం అమిత్ షాకు హోంశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.