నేడు హైదరాబాద్‌కు అమిత్ షా.. తొలి సభ్యత్వం ఆ మహిళకే..

| Edited By: Anil kumar poka

Jul 06, 2019 | 8:56 AM

దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాబోతున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ చేరనున్నారు. అనంతరం దాదాపు ఆరు గంటల పాటు బిజీబిజీగా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తొలుత విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో సమావేశమవ్వనున్నారు. అనంతరం శంషాబాద్ సమీపంలోని రంగనాయకుల తండా గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి కేఎల్‌సీసీ కన్వెన్షన్ […]

నేడు హైదరాబాద్‌కు అమిత్ షా.. తొలి సభ్యత్వం ఆ మహిళకే..
Follow us on

దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాబోతున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ చేరనున్నారు. అనంతరం దాదాపు ఆరు గంటల పాటు బిజీబిజీగా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తొలుత విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో సమావేశమవ్వనున్నారు. అనంతరం శంషాబాద్ సమీపంలోని రంగనాయకుల తండా గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి కేఎల్‌సీసీ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుని పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు.. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేసే అవకాశం ఉంది. కాగా, అమిత్ షా పర్యటనలో భాగంగా పలువురు ఇతర పార్టీల నేతలు కమలం గూటికి చేరనున్నారు.