#డబ్బా ఛాలెంజ్.. సవాళ్లు విసురుకుంటోన్న సెలబ్రిటీలు

| Edited By:

Jan 12, 2020 | 8:20 PM

మీరు ఇప్పటివరకూ గ్రీన్ ఛాలెంజ్, బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్‌లు విన్నారు కానీ.. ఈ ‘వాట్సప్‌ ఇన్ యువర్ డబ్బా ఛాలెంజ్’ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? పైన తెలిపిన ఛాలెంజ్స్‌‌లాగానే ఇదీ ఒక రకం. అయితే ఇది ఫుడ్ తినడం. కొన్ని వార్తలు వైరల్ అవుతూవుంటే సెలబ్రిటీలు పోస్టులు చేస్తూంటారు. కానీ కొన్నింటిని సెలబ్రిటీలే వైరల్ చేస్తారు. ఆ కోవలోకి చెందినదే ఈ డబ్బా ఛాలెంజ్. అసలు ఈ ఛాలెంజ్ ఉద్ధేశమేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ.. […]

#డబ్బా ఛాలెంజ్.. సవాళ్లు విసురుకుంటోన్న సెలబ్రిటీలు
Follow us on

మీరు ఇప్పటివరకూ గ్రీన్ ఛాలెంజ్, బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్‌లు విన్నారు కానీ.. ఈ ‘వాట్సప్‌ ఇన్ యువర్ డబ్బా ఛాలెంజ్’ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? పైన తెలిపిన ఛాలెంజ్స్‌‌లాగానే ఇదీ ఒక రకం. అయితే ఇది ఫుడ్ తినడం. కొన్ని వార్తలు వైరల్ అవుతూవుంటే సెలబ్రిటీలు పోస్టులు చేస్తూంటారు. కానీ కొన్నింటిని సెలబ్రిటీలే వైరల్ చేస్తారు. ఆ కోవలోకి చెందినదే ఈ డబ్బా ఛాలెంజ్.

అసలు ఈ ఛాలెంజ్ ఉద్ధేశమేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ.. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే. తర్వాత మరో ఇద్దరికి ఈ ఛాలెంజ్‌ని విసరాలి. ప్రస్తుతం దీనిపై పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. అసలు మొదట ఈ ఛాలెంజ్‌ని మొదలు పెట్టింది బాలీవుడ్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా. ‘నేను అప్పుడప్పుడు వడా పావ్ తింటూంటా. అయితే నా డబ్బాలో మాత్రం ఎప్పుడూ బీట్ రూట్ టిక్కీస్ ఉండాల్సిందే’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. తన భర్త అక్షయ్‌కి, ఫ్రెండ్స్‌ అయిన మలైకా, సోనాలీ బింద్రేలకు ఈ ఛాలెంజ్ విసిరారు.

ఈ పోస్ట్‌కి లైక్ కొడుతూ తనకి ఛాలెంజ్ విసిరిన ట్వింకిల్‌కి థ్యాంక్స్ చెప్పారు అక్షయ్. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తింటోన్న ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. హీరోయిన్స్ కత్రినా, భూమి పెడ్నేకర్‌లతో పాటుగా క్రికెటర్ శిఖర్ ధావన్‌లకు ఈ ఛాలెంజ్ విసిరాడు. అలాగే ఈ పోస్ట్‌పై మలైకా అరోరా కూడా స్పందించింది. తను లంచ్ చేస్తోన్న ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. శిల్పా శెట్టి, అర్జున్ కపూర్‌లకు సవాలు విసిరింది.