బాలీవుడ్లో ప్రస్తుతం అత్యధికంగా బిజీగా ఉండే అక్షయ్ కుమార్..అత్యధికంగా పారితోషకం అందుకుంటూ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. బాలీవుడ్లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తుండటంతో అక్షయ్ కుమార్ వార్షిక ఆదాయం కూడా ఎక్కువే అని చెప్పాలి.
ఇక అక్షయ్ పారితోషకం గురించి తాజాగా జాతీయ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో అక్షయ్ తన పారితోషకాన్ని భారీగాతగ్గించుకున్నాడట. సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న బచ్చన్ పాండే సినిమాలో నటిస్తున్నందుకు అక్షయ్ కుమార్ రూ.99 కోట్ల వరకు పారితోషకం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్కు ముందు అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు రూ.110 నుంచి రూ.120 కోట్ల వరకు డిమాండ్ చేసేవాడట. కాని కరోనా కాలంలో తన పారితోషకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల అక్షయ్ నటిస్తున్న సినిమాలు రూ.150 కోట్లకుపైనే వసూళ్ల సాధించాయి.