‘ఆయుధపూజ’పై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్!

|

Oct 10, 2019 | 5:12 AM

రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆయుధ పూజ పేరుతో రక్షణ మంత్రి   ‘తమాషా’ చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. భారత వైమానిక దళం ఫ్రాన్స్ నుంచి నిన్న తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో విజయదశమి కూడా కావడంతో ఈ సందర్భంగా భారత సంప్రదాయం ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ ‘ఆయుధ పూజ’ […]

ఆయుధపూజపై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్!
Follow us on

రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆయుధ పూజ పేరుతో రక్షణ మంత్రి   ‘తమాషా’ చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. భారత వైమానిక దళం ఫ్రాన్స్ నుంచి నిన్న తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో విజయదశమి కూడా కావడంతో ఈ సందర్భంగా భారత సంప్రదాయం ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ ‘ఆయుధ పూజ’ నిర్వహించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ…

‘‘అలాంటి తమాషాలు అవసరం లేదు. ఇంతకు ముందు మేము బోఫోర్స్ గన్ తెచ్చినప్పుడు… ఎవరూ అలా వెళ్లి ఆర్భాటాలు చెయ్యలేదు. ఆయుధాలు మంచివా, కావా అన్న విషయం తేల్చాల్సింది వైమానిక దళ అధికారులే. అలా కాకుండా వీళ్లే వెళ్లి, ఆర్భాటాలు చేసి, విమానంలో కూర్చుంటున్నారు..’’ అని పేర్కొన్నారు. యుద్ధ విమానం అప్పగింత కార్యక్రమానికి మతం కోణం చొప్పించడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు తొలి రాఫెల్ యుద్ధ విమానం నిన్న భారత వైమానిక దళానికి అందింది. ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ నిన్న ఈ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు. విమానంపై ‘ఓం’ అని రాసి, కొన్ని పుష్పాలు, కొబ్బరికాయ పెట్టారు. అలాగే టైర్లు కింద నిమ్మకాయలు ఉంచారు. అనంతరం ఈ సన్నివేశాలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. విజయ దశమి రోజు ఆయుధ పూజ చేయడం భారత సంప్రదాయమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

రాఫెల్ యుద్ధవిమానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌లో అందుకుంటా దానికి ‘ఆయుధ పూజ’ జరపడంపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. సంప్రదాయాలపై పరిహాసం తగదన్నారు. ఆయుధపూజ అనేది కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్టు కనిపిస్తోందని, విజయదశమినాడు ఆయుధపూజ చేసుకోరా? అని సూటిగా ప్రశ్నించారు. హర్యానాలోని కైతాల్‌లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, ఆయుధపూజను పరిహసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పునరాలోచించుకోవాలని అన్నారు. సంప్రదాయాలపై పరిహాసం ఏమిటని నిలదీశారు.
అమిత్‌షా తన ప్రసంగంలో 370 ఆర్టికల్ రద్దు, కశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు విధించడంపై కూడా మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి అసాధరణ నిర్ణయం తీసుకున్నాం. దేశాన్ని ఇంతవరకూ పాలించిన ఏ ఒక్కరూ దీన్ని సాధించలేకపోయింది. 370 అధికరణ అనేది రాజకీయ అంశం కానేకాదు. దేశ ఐక్యతను సాధించే అంశం. కానీ, దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది’ అంటూ షా మండిపడ్డారు. దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులను కాంగ్రెస్ ఆశిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్ స్పష్టం చేయాలని అమిత్‌షా నిలదీశారు.