ఆఫ్ఘన్లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానం ఈ-29 శుక్రవారం ఉదయం కుప్పకూలింది. శిక్షణా సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. దోషి జిల్లాలోని బాగ్లాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. పైలట్కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని.. ఆఫ్ఘన్ రక్షణ శాఖ వెల్లడించింది. అఇయతే ఘటనపై విచారణ జరుపుతున్నామని.. ప్రమాదానికి గల కారణాల గురించి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.