వైసీపీలో అమరావతి వార్..పోసానికే బుద్ది లేదన్న పృథ్వీ..

|

Jan 11, 2020 | 12:50 PM

ఏపీలో రాజధాని వేడి మంచి రైజ్‌లో ఉంది. అమరావతి రైతులు ఆందోళనల నేపథ్యంలో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా తన మనసులోని భావాలను చెప్పే వైసీపీ మద్దతుదారుడు పోసాని..ఈ సారి తన సహనటుడు, ఎస్వీబిసీ చైర్మన్ పృథ్వీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రైతులు కడుపు మండి ఆందోళనలు చేస్తుంటే, పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటావా అంటూ మండిపడ్డారు. రకరకాల సామాజిక వర్గాలకు చెందిన రైతులు రాజధానికి భూములు ఇస్తే, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ […]

వైసీపీలో అమరావతి వార్..పోసానికే బుద్ది లేదన్న పృథ్వీ..
Follow us on

ఏపీలో రాజధాని వేడి మంచి రైజ్‌లో ఉంది. అమరావతి రైతులు ఆందోళనల నేపథ్యంలో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా తన మనసులోని భావాలను చెప్పే వైసీపీ మద్దతుదారుడు పోసాని..ఈ సారి తన సహనటుడు, ఎస్వీబిసీ చైర్మన్ పృథ్వీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రైతులు కడుపు మండి ఆందోళనలు చేస్తుంటే, పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటావా అంటూ మండిపడ్డారు. రకరకాల సామాజిక వర్గాలకు చెందిన రైతులు రాజధానికి భూములు ఇస్తే, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చెయ్యడం కరెక్ట్ కాదంటూ సూచించారు. పృథ్వీ సిగ్గుపడాలని, వెంటనే రాజధాని రైతులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పోసాని మాటలకు అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు పృథ్వీ. పోసానికి బుద్ధి లేదు కాబట్టే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజధాని రైతులపై బొత్స, రోజా లాంటి వాళ్లు కామెంట్‌ చేశారు, వాళ్లపై మాట్లాడే దమ్ము పోసానికి ఉందా అంటూ ప్రశ్నించారు. రైతుల ముసుగులోని బినామీలను మాత్రమే పెయిడ్‌ ఆర్టిస్టులు అన్నానని, రాజధానిలో ధర్నా చేస్తున్నవారిలో తనతో పనిచేసిన ఆర్టిస్టులు ఉన్నారని తెలిపారు. పోసాని తన సొంత కులానికి వత్తాసు పలుకుతున్నారని,  కార్యదర్శిగా తాను పార్టీ స్టాండ్‌ మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు. వరదల సమయంలో జగన్‌కు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టులని తెచ్చి యాక్టింగ్ చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు పృథ్వీ.