నిజం తెలుసుకోకుండా మమ్మల్ని ట్రోల్‌ చేశారు: కృష్ణుడు

| Edited By:

Aug 31, 2020 | 5:42 PM

తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల పంజాగుట్ట పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

నిజం తెలుసుకోకుండా మమ్మల్ని ట్రోల్‌ చేశారు: కృష్ణుడు
Follow us on

Actor Krishnudu news: తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల పంజాగుట్ట పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో సినీ సెలబ్రిటీలు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేరు కూడా ఉండగా.. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఆమె ఎవరో తమకు తెలీదని ప్రదీప్, కృష్ణుడు ఇది వరకే స్పష్టతను ఇచ్చారు. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆ బాధితురాలు కూడా సెలబ్రిటీలకు సంబంధం లేదని తెలిపారు. డాలర్ బాయ్‌ తనను బెదిరించి, వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌ చేర్చమని ఒత్తిడి తెచ్చాడని వివరించింది. ఇక దీనిపై కృష్ణుడు మాట్లాడారు.

”ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు మీడియా ముఖంగా చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌లో యాంకర్ ప్రదీప్‌తో పాటు నా పేరును చేర్చారు. ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలీదు. సెలబ్రిటీపై ఆరోపణలు రాగానే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మాకు కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి ట్రోల్ చేశారు. మహిళలు ఎవరికైనా ఆపద ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోండి. బాధితురాలికి మా తరుపున ఎలాంటి సహాయం కావాలన్నా మేం సిద్ధం” అని కృష్ణుడు చెప్పుకొచ్చారు.

Read More:

టాలెంటెడ్ డైరెక్టర్‌తో రానా.. అధికారిక ప్రకటన

అపాయింట్‌మెంట్‌ కోరా.. జగన్‌ని కలుస్తా: బాలయ్య