Coronavirus cases registered in Kukatpally: దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో రానురాను కోవిడ్-19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కూకట్ పల్లి జంట సర్కిల్ పరిధిలో శనివారం రోజు కొత్తగా 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. మూసాపేట్ సర్కిల్లో 40 కరోనా కేసులు, కూకట్ పల్లి సర్కిల్ లో 14 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.
Also Read: అంబానీ, బఫెట్లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..