కుప్వారాలో ఉగ్రదాడి.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణం..

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 8:25 PM

CRPF: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో  జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. కుప్వారా జిల్లాలోని ఖజియాబాద్ ఏరియాలో సీఅర్‌పీఆర్ గస్తీ బృందంపై ఉగ్రవాదులు సోమవారం జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భారత బలగాలపై దాడి సమాచారం తెలియగానే అదనపు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. కాగా.. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదికి ఏ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయనేది […]

కుప్వారాలో ఉగ్రదాడి.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణం..
Follow us on

CRPF: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో  జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. కుప్వారా జిల్లాలోని ఖజియాబాద్ ఏరియాలో సీఅర్‌పీఆర్ గస్తీ బృందంపై ఉగ్రవాదులు సోమవారం జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భారత బలగాలపై దాడి సమాచారం తెలియగానే అదనపు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి.

కాగా.. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదికి ఏ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయనేది తెలియాల్సి ఉంది. హంద్వారా ఎన్‌కౌంటర్‌ జరిగి రెండు రోజులు కూడా కాకుండానే కుప్వారాలో తాజా ఉగ్రదాడి చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. హంద్వారా ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మే 2న ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

[svt-event date=”04/05/2020,7:53PM” class=”svt-cd-green” ]