ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు..

| Edited By:

Apr 04, 2020 | 4:19 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా

ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు..
Follow us on

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా కేసులన్నీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివేనని తెలుస్తోంది. ఈ 25 కేసులతో ఆగ్రాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 45కి చేరింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 175 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.