పెళ్లి బృందం బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 16, 2019 | 1:20 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా బంధుమిత్రులంతా కలిసి సంతోషంగా.. ఆడుతూ పాడుతూ బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు కొద్ది దూరం వెళ్లాక ప్రమాదానికి గురై బోల్తా పడింది. జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం దగ్గర జరిగిన.. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో […]

పెళ్లి బృందం బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా బంధుమిత్రులంతా కలిసి సంతోషంగా.. ఆడుతూ పాడుతూ బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు కొద్ది దూరం వెళ్లాక ప్రమాదానికి గురై బోల్తా పడింది. జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం దగ్గర జరిగిన.. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వారిని.. ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.