మోర్టార్లతో తాలిబన్ల దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి..

| Edited By:

Jul 25, 2020 | 6:01 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తాలిబన్ ఉగ్రవాదులు లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో సామాన్య ప్రజలు కూడా బలవుతున్నారు. అటు తాలిబన్ ఉగ్రవాదులు కూడా ఆఫ్ఘన్‌ సైన్యాన్ని..

మోర్టార్లతో తాలిబన్ల దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి..
Follow us on

ఆఫ్ఘనిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తాలిబన్ ఉగ్రవాదులు లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో సామాన్య ప్రజలు కూడా బలవుతున్నారు. అటు తాలిబన్ ఉగ్రవాదులు కూడా ఆఫ్ఘన్‌ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ.. ఔట్‌ పోస్టులపై దాడులకు తెగబడుతున్నారు. వీరి మధ్య జరుగుతున్న ఘర్షణలో సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా ఓ చెక్ పాయింట్ వద్ద మోర్టార్ షెల్స్‌తో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా.. మరో నలుగురు మరణించారు. వీరిలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంకా తాలిబన్లు ప్రకటించలేదు. ఇదిలావవుంటే.. సైన్యం జరిపిన దాడుల్లో ఓ కమాండ్‌తో సహా.. తొమ్మిది మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమైనట్లు తఖర్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.