భారీ అగ్నిప్రమాదం.. 17మంది సజీవదహనం

| Edited By: Vijay K

Mar 08, 2019 | 6:47 AM

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17మంది సజీవ దహనం అయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చి.. 35మందిని రక్షించారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరగగా.. ఆ సమయంలో చాలామంది నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య […]

భారీ అగ్నిప్రమాదం.. 17మంది సజీవదహనం
Follow us on
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17మంది సజీవ దహనం అయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చి.. 35మందిని రక్షించారు.
ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరగగా.. ఆ సమయంలో చాలామంది నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు తెలిపారు. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ సత్యేంద్ర జైన్.. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలామంది ఊపిరాడక మరణించారని.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు.