Neyveli Lignite power plant boiler explosion: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ విద్యుత్ ప్లాంట్లో జరిగిన బాయిలర్ పేలుడులో ఆరుగురు మృతి చెందారు, పాతికమంది కార్మికులు గాయపడ్డారు. నైవేలి లిగ్నైట్ ప్లాంట్ స్టేజ్ 2 లోని బాయిలర్లో పేలుడు సంభవించింది. క్షతగాత్రులను ఎన్ఎల్సి లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. మే నెలలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్ప్లాజాలు..