తెలంగాణలో 1,269 పాజిటివ్‌ కేసులు.. 8 మంది మృతి..

| Edited By:

Jul 12, 2020 | 9:45 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. కరోనా కట్టడికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 1,269 పాజిటివ్ కేసులు

తెలంగాణలో 1,269 పాజిటివ్‌ కేసులు.. 8 మంది మృతి..
Follow us on

Coronavirus In Telangana: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. కరోనా కట్టడికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఆదివారం 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

రాష్ట్రంలో తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 800 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 94, సంగారెడ్డి జిల్లాలో 36, ఖమ్మం జిల్లాలో 1, వరంగల్ అర్బన్‌ జిల్లాలో 12, వరంగల్ రూరల్‌ జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 4, కరీంనగర్ జిల్లాలో 23, జగిత్యాల జిల్లాలో 4, యాదాద్రి జిల్లాలో 7, మహబూబాబాద్ జిల్లాలో 8, పెద్దపల్లి జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 14, మహబూబ్ నగర్ జిల్లాలో 17, మంచిర్యాల జిల్లాలో 3, నల్గొండ జిల్లాలో 15, సిరిసిల్ల జిల్లాలో 3, ఆదిలాబాద్ జిల్లాలో 4, వికారాబాద్ జిల్లాలో 6, నాగర్ కర్నూల్ జిల్లాలో 23, జనగాం జిల్లాలో 6, నిజామాబాద్ జిల్లాలో 11., వనపర్తి జిల్లాలో 15, సిద్దిపేట జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 7, గద్వాలజిల్లాలో 7 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.